నిరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు

నిరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు

Last Updated : Oct 17, 2019, 04:45 PM IST
నిరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు నవంబర్ 11 వరకు కస్టడీ పొడిగించింది. వీడియో లింక్ ద్వారా వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టులో హాజరుపర్చగా.. నిరవ్ మోదీకి కస్టడీ పొడిగిస్తూ జడ్జి నినా టెంపియా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్ల మేర మోసం చేసి లండన్‌కు పారిపోయిన నిరవ్ మోదీని అక్కడి పోలీసులు ఇదే ఏడాది మార్చి 20న అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లండన్ జైల్లోనే ఉంటున్న నిరవ్ మోదీ పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది.

Trending News