Vijayawada: ముగ్గుర్ని కారులో ఉంచి..సజీవ దహనం చేసేందుకు ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) విజయవాడలో దారుణం  చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తుల్ని కారులో ఉంచి లాక్ చేసి మరీ నిప్పంటించారు దుండగులు. అసలేం జరిగింది విజయవాడలో..

Last Updated : Aug 17, 2020, 10:06 PM IST
Vijayawada: ముగ్గుర్ని కారులో ఉంచి..సజీవ దహనం చేసేందుకు ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) విజయవాడలో దారుణం  చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తుల్ని కారులో ఉంచి లాక్ చేసి మరీ నిప్పంటించారు దుండగులు. అసలేం జరిగింది విజయవాడలో..

కృష్ణా జిల్లా ( krishna district ) విజయవాడ నగరం ( Vijayawada city ) నడిబొడ్డున పట్టపగలు జరిగిన దారుణం అందర్నీ ఉలిక్కిపడేలే చేసింది. నగరంలోని నోవాటెల్ హోటల్ ( novotel hotel ) వద్ద ఓ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే...బయట్నించి లాక్ చేసి కారుకు నిప్పంటించారు దుండగులు. అదృష్టవశాత్తూ తప్పించుకున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. వాస్తవానికి కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్ రెడ్డి లు ఓ కారులో కూర్చుని రియల్ ఎస్టేట్ లావాదేవీ విషయమై చర్చించుకుంటున్నారు. చర్చల మధ్యలో ఏం జరిగిందో గానీ..ఒక్కసారిగా వేణుగోపాల్ రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి..కారు లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు సమాచారం. ప్రస్తుతం వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Also read: AP: అంగన్ వాడీలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్

Trending News