ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ; జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ జోక్యంపై అభ్యంతరం

జగన్ పై దాడి కేసులో ప్రధాని మోడీకి  ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

Last Updated : Jan 12, 2019, 01:52 PM IST
ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ; జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ జోక్యంపై అభ్యంతరం

జగన్ పై కొడికత్తి దాడి కేసులో ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ కేసులో ఎన్ఐఏ జోక్యంపై ఆయన అభ్యంతరం తెలిపారు. శాంతిభద్రతల విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని...తమకు సంబంధంలేని విషయంలో ఎన్ఐఏ జోక్యం తగదని హితవు పలికారు. ఇది ఫెడలర్ స్పూర్తికి వ్యతిరేకమని.. రాష్ట్రాలను భయపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. దేశ రక్షణ, భద్రత కోసం.. ఉద్రవాదుల చర్యల నిర్మూలన సయయంలోనే ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని నిబంధనలు ఉన్నాయి..జగన్ పై జరిగిన దాడి చాలా విషయం..రాష్ట్ర ప్రభుత్వ పరువును తీయాలనే ఉద్దేశంతోనే మోడీ సర్కార్ ఈ చర్య తీసుకుందని ఆరోపణలు సంధించారు. ఎన్ఐఏ విషయంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల వెనక్కి తీసుకోవాలి ఈ  సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.
 

Trending News