అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం; ప్రజా వేదిక కూల్చివేతకు సీఎం ఆదేశం

అక్రమ కట్టడాలనిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Last Updated : Jun 24, 2019, 12:19 PM IST
అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం; ప్రజా వేదిక కూల్చివేతకు సీఎం ఆదేశం

అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు,ఉన్నాధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఎక్కడా అక్రమ కట్టడాలు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని ప్రజా వేదిక కట్టడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన భవనంలో కూర్చోని సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన ఈ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఇక్కడితోనే నాంది పలుకుతామన్నారు. ఎల్లుండి నుంచి ఈ ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజావేదిక భవనంలో ఇదే తమ చివరి సమావేశమని జగన్ పేర్కొన్నారు.

 

Trending News