అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం; ప్రజా వేదిక కూల్చివేతకు సీఎం ఆదేశం

అక్రమ కట్టడాలనిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Last Updated : Jun 24, 2019, 12:19 PM IST
అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం; ప్రజా వేదిక కూల్చివేతకు సీఎం ఆదేశం

అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు,ఉన్నాధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఎక్కడా అక్రమ కట్టడాలు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని ప్రజా వేదిక కట్టడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన భవనంలో కూర్చోని సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన ఈ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఇక్కడితోనే నాంది పలుకుతామన్నారు. ఎల్లుండి నుంచి ఈ ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజావేదిక భవనంలో ఇదే తమ చివరి సమావేశమని జగన్ పేర్కొన్నారు.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x