Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి

Accident in Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు ఇద్దరిని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 02:56 PM IST
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి

Accident in Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. నేడు 65వ రోజుక చేరుకుంది. మహారాష్ట్ర మీదుగా సాగుతున్న యాత్ర ఈరోజు (నవంబర్ 10) నాందేడ్ జిల్లా నుంచి హింగోలి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అయితే ఈ యాత్రలో ఊహించని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ట్రక్కు ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన నాందేడ్ జిల్లాలోని నాందేడ్-అకోలా హైవేపై జరిగింది.

నాందేడ్ జిల్లాలో భారత్ జోడో యాత్ర నాల్గవ రోజు యాత్ర మోండా ప్రాంతంలో జరిగింది. మొండా ప్రాంతంలో ప్రజలతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం పింపాల్‌గావ్‌లోని స్టాప్‌కు చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో నాందేడ్-అకోలా హైవే నుంచి కాలినడకన బయలుదేరింది. ఇంతలో వేగంగా వచ్చిన ట్రక్కు పాదయాత్రలో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశన్ (62), సాయుల్ (30) తీవ్రంగా గాయపడ్డారు. గణేశన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సయ్యూల్ అనరే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. గణేశన్, సాయుల్ ఇద్దరు తమిళనాడు వాసులుగా గుర్తించారు.

ప్రమాద వార్త తెలియగానే మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఎమ్మెల్యే మోహన్ హుంబర్డే  బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అశోక్ చవాన్ రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించినట్లు తెలుస్తోంది. తలకు బలమైన దెబ్బ తగలడంతో గణేశన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటికి 65వ రోజుకు చేరుకుంది. తెలంగాణ నుంచి నవంబర్ 7న రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్‌లోని డేగలూరు చేరుకున్న రాహుల్ గాంధీ ఐదు రోజుల పాటు అక్కడే ఉన్నారు. నాందేడ్‌లోని పింపాల్‌గావ్ మహాదేవ్, అర్ధాపూర్‌లోని విఠల్‌రావు దేశ్‌ముఖ్ కార్యాలయంలో రాత్రి బస చేశారు. 

శుక్రవారం ఉదయం దభాద్ నుంచి నాందేడ్-హింగోలి రహదారిపై అర్ధాపూర్ వద్ద పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. తర్వాత రోజులో చోరంబా ఫాటా నుంచి ప్రయాణం తిరిగి ప్రారంభమై రాత్రికి హింగోలి చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమైన తర్వాత రాహుల్ గాంధీకి రోడ్డుపై ప్రజలు స్వాగతం పలికారు. మార్గమధ్యంలో కాంగ్రెస్‌ నాయకులు, స్థానికులను కలుసుకుని వారితో మాట్లాడారు రాహుల్ గాంధీ.

కాగా ఇటీవల తెలంగాణ కొత్తూరు మండల కేంద్రంలోని పేపర్ స్పోర్ట్ వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మంటల్లో ఒక 125 కేవీ, మరొక 62 కేవీ జనరేటర్ దగ్ధమయ్యాయి. మంటలు పక్కలకు వ్యాపించడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న మరో రెండు డీసీఎం వాహనాలు కూడా కాలిపోయాయి.  

Also Read: YS Sharmila: నా తలకాయ.. నా చెమట అని కేసీఆర్ సొల్లు చెప్పారు.. టీఆర్ఎస్ సర్కారుపై చర్యలు తీసుకోండి: మోదీకి వైఎస్ షర్మిల రిక్వెస్ట్  

Also Read: T20 World Cup 2022: ఇంగ్లండ్‌పై భారత్ ఓడిపోవడమే మంచిదయ్యింది.. లేదంటేనా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News