Telangana Global Summit 2025: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ నేటి నుంచి హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనిపై ప్రముఖ అనలిస్టు జయరామ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Renuka Chowdhury Controversy: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇవాళ ఓ కుక్కపిల్లను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఆ కుక్కపిల్లను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఆ కుక్కపిల్ల ఎవరినైనా కరిస్తే పరిస్థితి ఏంటని కొందరు ఆందోళన చెందారు. దీనిపై రేణుకా చౌదరి స్పందిస్తూ.. “కరిచేవాళ్లు పార్లమెంట్ లోపల కూర్చున్నారు” అంటూ కామెంట్స్ చేశారు. రేణుకాచౌదరి ఆ కుక్కపిల్లను తర్వాత కారులో ఇంటికి పంపారు. కుక్కపిల్లను ఆమె కేంద్ర మంత్రులు, ఎంపీలతో పోల్చడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. రేణుకా చౌదరి చేసిన కామెంట్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య పార్లమెంట్ను,
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నలుగురు మంత్రులను తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.
BJP vs Congress Naxal Issue: యూపీఏ పాలనలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు విస్తరించాయని బీజేపీ విమర్శించింది. ఎన్డీఏ హయాంలో భద్రత, అభివృద్ధి వ్యూహంతో హింస ఘటనలు తగ్గాయని పేర్కొంది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఎన్నో దాడులు జరిగాయని ఆరోపించింది.
Rahul Gandhi What Next: రోజులు మారే కొద్ధి.. రాజకీయాల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతోంది. హ్యాట్రిక్ ఓటములు కాంగ్రెస్ పార్టీని కోలుకోనీకుండా చేస్తున్నాయి. కాలక్రమంలోఒక్కో రాష్ట్రంలో ఆధికారాన్ని కోల్పోతూ వస్తోంది.
Karnataka Congress Power Politics: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి అయింది. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు.దీంతో కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ కు తెర లేపాయి.
MLA Defection Case: BRS ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. మూడు నెలల గడువు ముగియటంతో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై మరో నాలుగు వారాల గడువు విధిస్తూ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Naveen Yadav Winning Rally: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఘన విజయాన్ని పురస్కరించుకొని.. జూబ్లీహిల్స్లో భారీ ర్యాలీ నిర్వహించారు.
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. అయితే నవీన్ యాదవ్కు దున్నరాజులతో.. కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు.
Naveen Yadav In Temple: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధీక్యం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో.. నవీన్ యాదవ్ పూజలు చేశారు. జూబ్లీహిల్స్లో తానే గెలవబోతున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందన్నారు.
Bihar Assembly Election 2025 Phase 2: దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. చలి తీవ్రత కారణంగా ప్రజలు మెల్లగా పోలింగ్ కేంద్రాల వైపు కదులుతున్నారు. తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండో విడతలో 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
Jubilee Hills By Poll 2025: తెలంగాణలో రాజకీయాల్లో అధికార కాంగ్రెస్- ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ పరువు -ప్రతిష్టకోసం తాపత్రయ పడుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ బై పోల్...రెండు పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. అటు బీజేపీ కూడా రంగంలోకి దిగి ప్రచారంలో దూకుడు మీదుంది. ప్రచారం ముగిసిన రేపు జరగబోతున్న ఎన్నికలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ ఎన్నికలో గట్టెక్కేదెవరు? బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
BJP Counter to Rahul Gandhi: ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కమిషన్ను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది.
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది..! పోలింగ్కు మరో వారం రోజులే గడువు ఉండటంతో.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు..! అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై హైకమాండ్ పెద్దలు నిఘా పెట్టారా..! సీఎంతో సహా మంత్రులు చేస్తున్నా ప్రచారంపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారా..! అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని నేతలను ఆదేశించారా..!
Telangana Assembly Speaker: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ ఈరోజు, రేపు జరుపనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. తిరిగి ఈనెల 12,13 తేదీల్లో కూడా విచారణ కొనసాగనుంది.
Bihar Assembly Election 2025 Phase 1: బిహార్లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో ఆధిపత్యంపై రెండు కూటములు ధీమాగా ఉన్నాయి.
Jubilee hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్వానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామిలను ఉద్దేశిస్తూ కొంత మంది నియోజకవర్గంలో అక్కడక్కడ పోస్టర్స్ అంటించడం ఇపుడు కలకలం రేపుతోంది.
Congress Ministers Issues: ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. DCC నియామకాలపై AICC పెద్దలకు తమ అభిప్రాయలను చెప్పమన్నారు. మంత్రుల వివాదంపై సీఎంతో పార్టీ పెద్దలు మాట్లాడి ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills By Election: తెలంగాణ మాల సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో 30 నామినేషన్లు దాఖలు చేశారు ఎస్సీ సంఘాల నేతలు. మరో 30 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఎస్సీ కులాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.