Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?

Pawan Kalyan Fans Irresponsible : సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయన అభిమానుల తీరు షాక్ కలిగిస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 15, 2022, 04:39 PM IST
Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?

Pawan Kalyan Fans Irresponsible Behaviour: సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ శోక సంద్రంలోకి నెట్టేసింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు సూపర్ స్టార్ కృష్ణ తన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతానికి ఆయన పార్థివ దేహాన్ని విజయకృష్ణ నివాసానికి తరలించారు. సాయంత్రం గచ్చిబౌలిలోని స్టేడియం తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

ఇక రేపు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. లేదు పద్మాలయ స్టూడియోలో జరిగే అవకాశం ఉందని మరో ప్రచారం కూడా ఉంది. అయితే ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది అయితే సూపర్ స్టార్ మరణ వార్త విన్న వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రయత్నం చేశారు. ఆయన చిత్ర సీమలో సూపర్ స్టార్ అనే బిరుదుకు సార్ధకత చేకూర్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని తాను ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్న ఆయన కృష్ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

అక్కడే ఉన్న మహేష్ బాబు సహా కృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను ఆపి కొద్దిగా మాట్లాడాల్సిందిగా కోరారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులో లేక మరెవరో తెలియదు కానీ పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ తమను చూడాల్సిందిగా కోరుతున్నట్లుగా రభస సృష్టించారు.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులో లేక కృష్ణ గారి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన వారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ను చూడంగానే వాళ్లు రెచ్చిపోతున్న వైనం మాత్రం అసలు ఏమాత్రం ఉపేక్షనీయం కాదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అయి ఉండవచ్చు కానీ సూపర్ స్టార్ కృష్ణలాంటి ఒక వ్యక్తి మరణించినప్పుడు కనీసం ఆయన మరణానికి గౌరవం ఇవ్వాలి. ఇలా చిల్లర చేష్టలు చేస్తూ అరిస్తే వారు పవన్ కళ్యాణ్ అభిమానులైనా మరెవరైనా సరే అది ఖండించాల్సిన విషయమే.

ఇదే విషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ ఖండించారు. కొబ్బరి మట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ ఈ సమాజంలో పనికిమాలిన ఎదవలే ఎక్కువ అని బలంగా నమ్మాలి అనిపించేది ఇలాంటి సమయాల్లోనే ఆ అరుపులు కేకలు చూడు అంటూ ఒక వీడియో షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఉండగా పెద్ద ఎత్తున అరుపులు కేకలతో కొందరు రెచ్చిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.

Also Read: Adipurush Hindi Teaser : కొత్త రికార్డ్.. బాలీవుడ్‌ వెన్నులో వణుకు.. ప్రభాస్ క్రేజ్ ఇదే

Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News