Project K Update: 'ప్రాజెక్ట్ కే' గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. డైరెక్టర్ అలా రివీల్ చేశారుగా! ఆ ఒక్క మాటతో

Prabhas Project K movie Stroy Line revealed by Nag Ashwin. భారత ఇతిహాస గాథ నేపథ్యంలో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 06:26 PM IST
  • 'ప్రాజెక్ట్ కే' గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • డైరెక్టర్ అలా రివీల్ చేశారుగా
  • ఆ ఒక్క మాటతో
Project K Update: 'ప్రాజెక్ట్ కే' గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. డైరెక్టర్ అలా రివీల్ చేశారుగా! ఆ ఒక్క మాటతో

Prabhas Project K movie Stroy Line revealed by Nag Ashwin: భారీ అంచనాల మధ్య విడుదల అయిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్‌లు పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' క్రేజ్‌ను ఏ మాత్రం త‌గ్గించ‌లేదు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'సలార్' షూటింగ్ తుది దశకు వచ్చింది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. 

ప్రాజెక్ట్ కే సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇదివరకే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు కథకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. భారత ఇతిహాస గాథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా ప్రాజెక్ట్ కే స్క్రిప్ట్‌ను బొజ్జ గణపయ్య వద్ద నాగ్ అశ్విన్ పెట్టారు. ఆపై ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 

ప్రాజెక్ట్ కే సినిమా సెట్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని చిత్ర యూనిట్‌ ప్రతిష్టించింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఓ నోట్‌ను రాసుకొచ్చారు. 'ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశారు. ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి విఘ్నేశ్వరా' అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట్‌ కే సినిమాకు భారతానికి సంబంధం ఉందని డైరెక్టర్ చెప్పకనే చెప్పారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మహాభారతంలోని ఒక చాప్టర్‌ ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కిస్తున్నారని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ‘కే’ అక్షరానికి అర్థం ఏంటో కూడా తెలియదు. ఈ విషయాలు తెలిలాయంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రంను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ప్ర‌భాస్‌, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్, బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను 2023  అక్టోబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. 

Also Read: ఆ హీరోకు ఎన్ని ముద్దులు అయినా ఇస్తా.. సురేఖా వాణి షాకింగ్ కామెంట్స్!

Also Read: SSMB28 Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News