అ సినిమా ట్రైలర్ చూసి ఫిదా అయిన రాజమౌళి

అ సినిమా వెనుకున్న చరిత్రను నాలుగు ముక్కల్లో వివరించాడు నాని.

Last Updated : Feb 2, 2018, 06:12 PM IST
అ సినిమా ట్రైలర్ చూసి ఫిదా అయిన రాజమౌళి

నాని నటించిన తాజా చిత్రం 'అ' ట్రైలర్ చూశాకా ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే కోరిక రెండింతలు అయ్యిందని అన్నాడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హాజరైన సందర్భంగా వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. అ సినిమా ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసిందని నానిపై, ఆ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు.

అ సినిమాలో హీరోగా నటిస్తున్న నాని ఈ సినిమాతో నిర్మాతగానూ మారాడు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ఏర్పాటు చేసి ఈ సినిమాను నిర్మిస్తున్న నాని.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికే తాను నిర్మాతగా మారానని అన్నాడు. తాను సినిమాల్లో సంపాదించిన డబ్బుల్ని నిర్మాతగా ఇలా సినిమాలకే వెచ్చించదల్చుకున్నట్టు చెప్పాడు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ అనే దర్శకుడు కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

 

నిన్ను కోరి సినిమా టైమ్‌లోనే ప్రశాంత్ వర్మ నాకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పాడు. మంచి నిర్మాత దొరికినప్పుడు సినిమా చేద్దాం అని చెప్పాను. కానీ ఆ తర్వాత ఈ సినిమాను తానే నిర్మించాలని డిసైడ్ అయ్యాను అంటూ అ సినిమా వెనుకున్న చరిత్రను నాలుగు ముక్కల్లో వివరించాడు నాని.

కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా క్యసండ్రా, ఇషా రెబ్బ లాంటి నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, రోహిని మొల్లేటి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి పులికొండ లాంటి నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మహారాజ రవితేజ, నానిల వాయిస్ ఓవర్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మొత్తానికి నిర్మాతగా నాని తన తొలి ప్రయత్నాన్ని కాస్త గ్రాండ్ స్టైల్లోనే ట్రై చేస్తున్నాడు. 

Trending News