Allu Arjun: హీరోయిన్ పై డైరెక్టర్ దాడి.. కట్ చేస్తే అల్లు అర్జున్ ఎంట్రీ.!

Tollywood Herione: హీరో హీరోయిన్స్ ని షాట్ ..పర్ఫెక్ట్ గా రావడానికి డైరెక్టర్లు ఎంటలా హింసిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు.. ఇలానే తెగ హింసిచ్చారట. అప్పట్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి మరి ఆ హీరోయిన్ ని కాపాడారంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 22, 2024, 01:25 PM IST
Allu Arjun: హీరోయిన్ పై డైరెక్టర్ దాడి.. కట్ చేస్తే అల్లు అర్జున్ ఎంట్రీ.!

Allu Arjun Saves Herione: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటీనటుల మధ్య గొడవలు.. సర్వసాధారణం. డైరెక్టర్ - హీరోయిన్  మధ్య,  నిర్మాతలు - దర్శకుల మధ్య,  హీరో - హీరోయిన్ల మధ్య కొన్ని సందర్భాలలో వివాదాలు చోటు చేసుకుంటాయి. ఏ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా గొడవకు దారితీస్తుంది.  అయితే పలువురు దర్శకులు వారు అనుకున్నట్లు షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆర్టిస్టులను అసలు వదిలిపెట్టరు. అలాంటి వారిలో రాజమౌళి కూడా ఒకరు.  ముఖ్యంగా తాను అనుకున్న షాట్ రాకపోతే 100 సార్లైనా.. సరే ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టి మరీ తనకు రావాల్సిన షాట్  ను రాబట్టుకుంటాడు. 

ఇదిలా ఉండగా ఒక స్టార్ హీరోయిన్ తన కెరియర్ ప్రారంభంలో ఒక డైరెక్టర్ చేత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందని సమాచారం. ఒక డైరెక్టర్ నైట్ మొత్తం షూటింగ్ లో ఆమెను.. విసిగించేసాడట. ఒక షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి ఏకంగా 35 టేకులు తీసుకున్నారని,  దీనితో ఆ హీరోయిన్ ఈ ఆఫర్ కూడా వద్దంటూ షూటింగ్ నుంచి పారిపోయిందని సమాచారం. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి ఆ హీరోయిన్ తో మాట్లాడి,  మ్యాటర్ సెటిల్ చేసినట్లు అప్పట్లో ఒక వార్త ప్రచారం కాసాగింది. 

వద్దు అని విసుక్కొని వెళ్ళిపోదాం అనుకున్న ఆ  హీరోయిన్ కి ఆ సినిమా మైల్ స్టోన్ గా మారింది.  ఇంతకు ఆ మూవీ ఏంటి?  ఆ హీరోయిన్ ని అంతలా టార్చర్ చేసిన డైరెక్టర్ ఎవరు ? అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. ఇక ఆ డైరెక్టర్ భాస్కర్. ఆ చిత్రం బొమ్మరిల్లు. 

సిద్దార్థ్ - జెనీలియా జంటగా బొమ్మరిల్లు సినిమాను తెరకెక్కించారు భాస్కర్. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే మొదటి రోజే షూటింగ్లో భాగంగా హీరోయిన్ కి డైరెక్టర్ చుక్కలు చూపించారని సమాచారం. 

ఈ సినిమాలో హైలైట్.. యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసిన సీన్  ఏదైనా ఉందంటే అది రాత్రి సమయంలో హీరోయిన్ బయటకు వచ్చి,  చల్లని వాతావరణంలో ఐస్ క్రీమ్ తినే సీన్.. ఈ సీన్ ముందుగానే చిత్రీకరించారట. ఈ సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.  ఈ విషయాలను స్వయంగా డైరెక్టర్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

భాస్కర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో హీరో, హీరోయిన్ బయటకు వచ్చి చల్లని ఐస్ క్రీమ్ తినే సీన్ ముందుగా చిత్రీకరించాము.  అయితే నైట్ ఎఫెక్ట్ కోసం రాత్రి 9 గంటలకు షూటింగ్ ప్రారంభించాము. ఆ సమయంలో హీరోయిన్,  హీరోని ఐస్ క్రీమ్ తింటావా అని అడగాలి. ఆ డైలాగ్ చెప్పమని చెప్పాను. కానీ జెనీలియా మేం చెప్పినట్లు చేయడం లేదు. సరైన ఎక్స్ప్రెషన్ కూడా రావట్లేదు. దీంతో మార్నింగ్ వరకు 35 టేక్స్ తీసాము.. దాంతో కోపం  వచ్చి వెళ్లిపోతానని చెప్పింది.  అదే సమయంలో హ్యాపీ అనే మూవీలో కూడా జెనీలియా నటిస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ బొమ్మరిల్లు సినిమా చేసేలా కన్విన్స్ చేశాడని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News