రజినీ '2.ఓ' టీజర్‌కు ముహూర్తం ఖరారు!

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం '2.ఓ'. స్టార్‌ డైరెక్టర్ ఎస్.శంకర్‌ ఈ సినిమా దర్శకుడు.

Last Updated : Aug 1, 2018, 11:26 AM IST
రజినీ '2.ఓ' టీజర్‌కు ముహూర్తం ఖరారు!

తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం '2.ఓ'. స్టార్‌ డైరెక్టర్ ఎస్.శంకర్‌ ఈ సినిమా దర్శకుడు. గతంలో రజినీ-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వెల్ ఇది. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటి వరకు పోస్టర్లు, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ వచ్చిన మూవీ యూనిట్ ఇంత వరకు టీజర్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే విజువల్‌ ట్రీట్‌తో ఆగస్టు 15న టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట 2.ఓ చిత్ర యూనిట్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేసిన ఈ సినిమాను 13 భాషల్లో అనువదిస్తున్నారు. నవంబర్ 29, 2018న ప్రపంచ వ్యాఫంగా విడుదల చేయాలని మూవీ యూనిట్ యోచిస్తోంది. అయితే దీనిపైకూడా క్లారిటీ లేదు.

తారాగణం: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాన్సు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. లైకా ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న '2. ఓ' సినిమా నిర్మాత అల్లిరాజా సుభాష్ కరణ్, మ్యూజిక్- ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాట్రోగ్రఫీ-నిరవ్ షా, ఎడిటింగ్-ఆంటోనీ.

Trending News