నెదర్లాండ్స్ లో మహాత్ముడి జయంతి వేడుకలు !

.

Last Updated : Sep 30, 2017, 04:48 PM IST
నెదర్లాండ్స్ లో మహాత్ముడి జయంతి వేడుకలు !

దిహేగ్‌ (నెదర్లాండ్స్‌): జాతిపిత మహాత్మ గాంధీ 148వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని  నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం మరియు అక్కడి ప్రభుత్వం సంయుక్త ప్రకటన చేశాయి.ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం  అక్టోబర్‌ 1, 2 తేదీల్లో హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’ పేరుతో ప్రత్యేక సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు  నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాల్లో  అహింసా సిద్ధాంతాన్ని బలపరిచే వివిధ అంతర్జాతీయ  సంస్థలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిథులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. అలాగే అక్టోబర్‌ 1వ తేదీన  నెదర్లాండ్స్ దేశ రాజధానిలోని  పీస్‌ ప్యాలెస్‌ నుంచి గ్రోట్‌కెర్క్‌ వరకు ‘గాంధీ మార్చ్‌’ చేపట్టనున్నారు. 

ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా  మహాత్మా గాంధీ వాడిన సైకిల్‌ను నెదర్లాండ్స్ లోని  గ్రోటె కెర్క్‌ వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సైకిల్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా ఆ దేశానికి  పంపించింది. అదేవిధంగా గ్రోటెకెర్క్‌ వద్ద ఉన్న కోర్జో థియేటర్‌లో "సత్యాగ్రహ" పేరుతో ప్రముఖ నెదర్లాండ్స్  కళాకారుడు ఫిలిప్‌ గ్లాస్‌ నేతృత్వంలో  రూపొందించిన ఒక సంగీత కచేరి కూడా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే ఒక ప్రత్యేక సభలో  ప్రమోద్‌ కుమార్‌ అనే భారతీయుడు రచించిన ‘గాంధీ- యాన్‌ ఇల్యుస్ట్రేటెడ్‌ బయోగ్రఫీ’  అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x