ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు జవాన్లు, ఇద్దరికి గాయాలు

ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు జవాన్లు, ఇద్దరికి గాయాలు

Last Updated : Apr 4, 2019, 04:19 PM IST
ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు జవాన్లు, ఇద్దరికి గాయాలు

చత్తీస్‌ఘడ్‌లో గురువారం సరిహద్దు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కంకర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పారామిలిటరి బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసి మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

చత్తీస్‌ఘడ్‌లో 11 లోక్ సభ నియోజకవర్గాలకుగాను ఏప్రిల్ 11, 18, 23 తేదీల్లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Trending News