కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలి 20 మంది మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలి 20 మంది మృతి

Last Updated : Aug 31, 2019, 12:30 PM IST
కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలి 20 మంది మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలిన దుర్ఘటనలో 20 మంది దుర్మరణంపాలైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ధులెకి సమీపంలోని శిర్పూర్ శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తున్నప్పటికీ.. మృతుల సంఖ్య 20 వరకు ఉన్నట్టు సమాచారం అందుతోంది. అక్కడి జీ న్యూస్ ప్రతినిథి నిత్యానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 110 మంది వరకు ఉన్నారని, అందులో మరో 50 మంది వరకు గాయపడినట్టు సమాచారం అందుతోంది. 

పేలుడు తీవ్రతను పరిశీలిస్తే, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని, మరో 70 మంది వరకు లోపల చిక్కుకున్నట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News