Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది. దీంతో వారు పండుగకు ముందే తీపి కబురును అందుకున్నారు.. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

మొన్నటి వరకు సన్న వడ్లకు బోనస్‌ రూ.500 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో బంపర్‌ ఆఫర్ తెలంగాణ రైతులకు అందించింది. దసరాకు ముందే వారికి తీపి కబురు అందినట్లయింది.   

2 /5

పామాయిల్‌ మద్ధతు ధర రూ.17,043 గెలల ధర పెరిగింది.  తెలంగాణ రైతులకు లాభసాటిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దసరాకు ముందే వచ్చిందని అన్నారు. కొత్తరైతులను కూడా ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.  

3 /5

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌ దిగుమతి సుంకం కూడా 5.5 నుంచి 27.5 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు.   

4 /5

ఇటీవలె సన్నవడ్లకు కూడా రూ.500 బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. రైతు భరోసా డబ్బులను కూడా దసరాలోపు రైతుల ఖాతాలో జమా చేయాలని యోచిస్తుందట.  

5 /5

ఈ బోనస్‌ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో ఖరీఫ్‌ సీజన్‌లోనే జమా చేయాలని ఆలోచిస్తుందట. ఈ సందర్భంగా 9,366 రైతులకు లబ్బి చేకూరుతుంది. కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇటీవల వరద ప్రభావిత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. వారు ఇలా దిగుమతి సుంకం పెంచినందుకు తుమ్మల ధన్యవాదాలు కూడా తెలిపారు.