Lady Of Justice: కళ్లు తెరచిన న్యాయ దేవత.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం ఫీచర్లు ఇవే!

New Lady Of Justice Statue: ఇన్నాళ్లు న్యాయదేవత అంటే కళ్లకు గంతలు కట్టుకుని ఉండేది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరచుకుంది. సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విగ్రహం న్యాయస్థానంలో కొలువుదీరింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

1 /9

భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇప్పుడు న్యాయదేవత కళ్లు తెరచుకుంది. 

2 /9

దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయదేవతకు కళ్లు ఉండాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

3 /9

గతంలో న్యాయ దేవత  కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి.

4 /9

కొత్తగా ఏర్పాటుచేసిన న్యాయ దేవత విగ్రహం కుడి చేతిలో త్రాసు అలాగే ఉంచి ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంచారు.

5 /9

ప్రస్తుతానికి సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని.. చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీంకోర్టు మార్పులు చేసింది.

6 /9

న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు అనే సందేశంతో విగ్రహానికి గంతలు కట్టి ఉండేవి.

7 /9

ఇక ఖడ్గం విషయానికి వస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు చేతిలో ఖడ్గం ఉండేది.

8 /9

కాగా కొత్త న్యాయ దేవత విగ్రహం కిరీటం, ఆభరణాలతో భారతమాత రూపంలో ఉండడం విశేషం. ఈ విగ్రహానికి ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా ఇదే విగ్రహాన్ని అన్ని న్యాయస్థానాల్లో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.

9 /9

కళ్లు తెరచిన న్యాయ దేవత ఇకనైనా బాధితులకు న్యాయం దక్కేలా ఉండాలని.. పేదలకు న్యాయం చేరువ కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.