Drone Show: పున్నమి ఘాట్‌లో డ్రోన్ల షో అదుర్స్‌.. కళ్లు చెదిరేలా డ్రోన్ల విన్యాసాలు

Amaravati Drone Summit: ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల షో అదిరే రీతిలో జరిగింది. డ్రోన్లతో వివిధ ఆకృతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ హాజరై అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్‌ను వీక్షించారు. కళ్లు చెదిరేలా ఉన్న డ్రోన్ల విన్యాసాలు అదుర్స్ అనిపించాయి.

1 /10

డ్రోన్ల టెక్నాలజీని వినియోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా డ్రోన్ల షో నిర్వహించింది.

2 /10

పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్‌ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

3 /10

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో వేలాది డ్రోన్లతో విన్యాసాలు చేయించారు. గతంలో ఎప్పుడూ లేని షో కావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

4 /10

డ్రోన్ల షో సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలకు చంద్రబాబు పాదాలు కదుపుతూ.. నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు.

5 /10

డ్రోన్ల షోలో అమరావతి రాజధానికి ప్రతీకగా ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహ రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

6 /10

జాతీయ జెండా, విమానం, భారత తపాలా సేవలు, డ్రోన్ల టెక్నాలజీ విశేషాలను తెలిపేలా డ్రోన్ల రూపాలు ఉన్నాయి.

7 /10

ప్రపంచంలోనే భారతదేశం టెక్నాలజీ అడ్డా అని తెలిపేలా ఓ రూపం ఆకట్టుకుంది.

8 /10

అతిపెద్ద డ్రోన్‌ షో కావడంతో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌కు గిన్నీస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

9 /10

భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజ‌ర్లుగా చెప్పొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ల పాలసీని తీసుకొస్తామని అంతకుముందు జరిగిన సభలో ప్రకటించారు.

10 /10

డ్రోన్ల సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రోన్లను ఉపయోగించి ఏపీని అభివృద్ధిలో ముంచుతానని చెప్పారు.