AP PGECET 2020 Results: ఏపీ పీజీఈసెట్‌-2020 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్

AP PGECET Results 2020 |  ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. sche.ap.gov.in లో ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఏయూ వైస్ ఛాన్స్‌లర్ తెలిపారు.

Last Updated : Oct 23, 2020, 02:48 PM IST
AP PGECET 2020 Results: ఏపీ పీజీఈసెట్‌-2020 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్

ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్-2020 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్‌లో పీజీ, ఫార్మసీతో పాటు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2020 ఫలితాలను ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. ఏపీ పీజీఈసెట్‌లో 87.98 శాతం విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఏయూ వైస్ ఛాన్స్‌లర్ తెలిపారు.

Click here for AP PGECET Results 2020 : ఏపీ పీజీఈసెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి

 

అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీఈసెట్ 2020 హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22,911 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 20,157 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షతో ఎంటెక్‌కు 14,775 మంది విద్యార్థులు, ఫార్మసీకి 5,382 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News