TRS MLAs complaint on YS Sharmila: వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్‌, మంత్రులపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్‌ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 10:23 PM IST

TRS MLAs complaint on YS Sharmila: ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సభాపతి చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని సభాపతి హామీ ఇచ్చారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఇవాళ సమావేశమయ్యే అవకాశముంది. ఇప్పటికే షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News