Kadapa Constable Family Death: భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన కడపలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగానే కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశ సరిహద్దుల్లో పగలు, రాత్రి.. ఎండ, వాన, చలి.. తుఫాను అంటూ ఎలాంటి పరిస్థితులు అయినా లెక్కచేయకుండా దేశానికి కాపలా కాసే ఇండియన్ ఆర్మీ అంటేనే మన అందరికి ఒక గౌరవం.. ధైర్యం. రెండు దశాబ్దాలుగా ఒక గ్రామం తమ పిల్లలను ఆర్మీకి ఇస్తున్న గ్రామం రామాపురం. ఆ వివరాలు
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
కడప జిల్లా గోపవరంలో టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డిపై వైసీపీ నేత వేణు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Husband And Pregnant Wife Died In Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు రైలు కింద పడి ప్రాణాలను తీసుకున్నారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా..
CBI Summons YS Avinash Reddy: వైఎస్ వివేకాంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Pulivendula Firing News Updates: పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషాకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
CBI Notices: ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
Kadapa: కడప జిల్లా బి.కోడూరు మండలంలోని రాజుపాలెంలో టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమాన్ని చేపట్టింది. టిడిపి మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి , టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రమణ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బద్వేలు నియోజకవర్గ ఇంచార్జ్ రితేష్ రెడ్డి పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.