HCA: జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల యుద్ధం..హెచ్‌సీఏ తీరుపై విమర్శలు..!

HCA: తెలంగాణలో క్రికెట్ టికెట్ల వివాదం కొనసాగుతోంది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయం ఉద్రిక్తతలకు దారి తీసింది.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 08:01 PM IST

HCA: హెచ్‌సీఏ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈనెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో జింఖానా మైదానంలో టికెట్ల విక్రయం ప్రారంభించారు. ఈసందర్భంగా తొక్కిసలాట జరిగింది. టికెట్ల విక్రయాల్లో ఆలస్యం జరగడంతో అభిమానులు పరస్పరం తోసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల లాఠీ ఛార్జ్‌లో పలువురికి గాయాలు అయ్యాయి. మరికొంతమంది స్పృహతప్పి పడిపోయారు.

Video ThumbnailPlay icon

Trending News