Fact Check: ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకోవాలనుకునేవారి సంఖ్యలో రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియాలో ఆ వార్తల క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. ఆ వార్తలు నిజమా..అని ఆలోచించే లూపే వాటిని షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలను కూడా ఎడిట్ చేసి వాస్తవ విరుద్ధ కథనాలను జోడించి వాటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో బంగారాన్ని ప్రభుత్వం నగదుగా మారుస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత అసలు వాస్తవం ఎంత ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం.
Stock Market Today: సోమవారం నాటి భారీ పతనం తర్వాత.. మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న యుద్ధ భయాలను డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక ప్రకటన పటాపంచలు చేసింది. మంగళవారం ఉదయం 9:15 గంటలకు మార్కెట్ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1040 పాయింట్లు ఎగబాకి 73,736.84 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 350 పాయింట్ల లాభంతో 22,863.25 వద్దకు చేరింది. మార్కెట్లోని అన్ని రంగాలు ఆకుపచ్చ రంగులో మెరుస్తుండటం విశేషం.
Stock Market Crash: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. చమురు ధరల భయాలు..విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలే దేశీయ సూచీలను ముంచేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లో భారీ నష్టాలతోనే ప్రారంభించాయి. ఈ సెషన్ లో సెన్సెక్స్ దాదాపు 1700 పాయింట్లు పతనం అవ్వగా.. నిఫ్టీ 23వేల మార్క్ ను కోల్పోయింది.
Skoda Kushaq Facelift Launched: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. స్కోడా కుషాక్ కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్తో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంస్కృతంలో ‘కుషాక్’ అంటే చక్రవర్తి అనే అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఈ SUV తన సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని చాటుకునే లక్ష్యంతో 2026 మార్చి 21న అధికారికంగా విడుదలైంది. స్టైలిష్ డిజైన్.. ఆధునిక టెక్నాలజీ.. పవర్ ఫుల్ ఇంజిన్ ఎంపికలతో ఈ కారు కస్టమర్లను ఆకర్షిస్తోంది.
HDFC Bank share Price Crash: హెడ్ డీఎఫ్సీ పార్ట్ టైం చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ అయిన అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామాతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో ఒక దశలో 9శాతం వరకు షేర్లు పతనం అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 3శాతం మేర పడిపోయింది. బ్యాంకులో గత రెండేళ్లలో జరిగిన కొన్ని ఘటనలు, ధోరణులను అంగీకరించలేకపోతన్నానని అతను వెల్లడించడం ప్రభావం చూపింది. తాజా పరిణామాలతో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులో ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్లకు పైగా ఆవిరైంది.
Oil Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదవ రోజుకు చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్కు సూచికగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 29 శాతం వరకు పెరిగి బ్యారెల్కు 100 డాలర్లను దాటింది. పలు జాతీయ దిన పత్రికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్పై రష్యా దాడి జరిగిన సమయంలో కనిపించిన స్థాయికి మరోసారి చమురు ధరలు చేరుకున్నాయి.
Stock Market Crash: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 600 పాయింట్లకు మించి క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, పెట్టుబడిదారుల ఆందోళనల కారణంగా సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Crude Oil Price Today: పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల మార్క్ దాటింది. మూడున్నర సంవత్సరాల్లో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటి సారి.
Stock Market: పశ్చిమాసియాలో యుద్ధ ప్రకంపనలు దలాల్ స్ట్రీట్ నూ అతలాకుతలం చేశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్ట్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు పెరగడం, తాజా ఉద్రిక్తతల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు నెలకున్నాయి. మదుపర్లు సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ 10లక్షల కోట్ల మేర ఆవిరైంది.
Stock Market Middle East tensions: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అనంతర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదలతో సూచీలు భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 300 పాయింట్ల మేర తగ్గింది.
PF ATM-UPI Withdrawal Rules: ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకునే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం తీసుకువస్తామని ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. 2026 మార్చిలోపు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఓ జాతీయ వార్తా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Bajaj Finance: జీఎస్టీ తగ్గింపుతో ఈ ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులు ఎక్కువ కొనుగోళ్లు చేశారని.. తాము రికార్డుస్థాయిలో రుణాలను పంపిణీ చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. 63 లక్షల రుణాలను అందజేసినట్లు చెప్పారు.
New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బిఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Gold: భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా. పరిమితికి మంచి బంగారం ఉంచితే ఏమౌతుందో తెలుసా. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kotak Mahindra Bank: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఊరట లభించింది. గత ఏడాది విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మరింత సులభం కానుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
Gold Rate Today:ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.340 తగ్గి రూ.87,960కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.88,300 వద్ద ముగిసింది.
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా నెల జీతం ఫ్రీగా పొందవచ్చు. ఇందుకు యూఏఎన్ యాక్టివేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకే అవకాశం ఉంటుందని తెలిపింది. మరి వెంటనే మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Avoid using Chat Deepseek: అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek లను ఉపయోగించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది.అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను కోరింది.
New Income Tax Rates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కొత్త పన్ను విధానం ప్రకారం..వార్షిక ఆదాయం రూ. 12లక్షల వరకు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ కొత్త పన్ను శ్లాబులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.