7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే ‌షాక్.. డీఏ విషయంలో బ్యాడ్‌న్యూస్..!

7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా.. ఈసారి మాత్రం 3 శాతం పెంపుతో సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనపెడితే కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..?
 

1 /7

పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్రాట్యుటీని పెంచుతోంది. ఈ గ్రాట్యుటీ పెరిగే కొద్దీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతున్నాయి.  

2 /7

త్వరలోనే జూలై 2024 డీఏ పెంపు ప్రకటన ఉండనుంది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

3 /7

ఈ ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.  

4 /7

ఈ విషయం పక్కనపెడితే.. కోవిడ్ సమయంలో నిలిపేసిన 18 నెలల డీఏ బకాయిలకు సంబంధించిన షాకింగ్ ప్రకటన వైరల్ అవుతోంది.  

5 /7

పెండింగ్‌ డీఏ చెల్లించడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించినట్లు తెలుస్తోంది.  

6 /7

కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 18 నెలలపాటు డీఏను ఇవ్వలేదు. పెండింగ్ డీఏను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.  

7 /7

ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్రం ఎలాంటి గుడ్‌న్యూస్ చెప్పలేదు.