YSRCP Joinings: టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి జంప్‌.. వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిక

Mudunuri Murali Krishnam Raju Joins Into YSRCP: అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన చేరడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఫుల్‌ జోష్‌ వచ్చింది.

1 /7

YSRCP Joinings: టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి జంప్‌.. వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిక

2 /7

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు పార్టీని వీడడం కలకలం రేపింది.

3 /7

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీ కృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేశారు. అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఆయన ఉండడం గమనార్హం.

4 /7

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, అనుచరులు కూడా పార్టీ కండువా మార్చుకున్నారు.

5 /7

అధికారంలో ఉన్న టీడీపీని వదిలేసి మురళీ కృష్ణంరాజు వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

6 /7

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించారు.

7 /7

వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం ఇచ్చారు.