Chiranjeevi: చిరంజీవి పెద్ద మనసు..వీరాభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్..


Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అభిమానులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఫ్యాన్స్ కు చిరంజీవి అంటే దైవంతో సమానం. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని చిరు ఆయు:ఆరోగ్యాలతో వర్ధిల్లాలంటూ పొర్లు దండాలతో తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన వీరాభిమాన్ని చాటుకున్నాడు.

1 /5

Chiranjeevi: చిరు బర్త్ డే సందర్బంగా ఆయన అభిమాని అయిన ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమలకు పొర్లు దండాలతో వెళ్లి తన మెగాభిమాన్ని చాటుకున్నాడు. దీంతో చలించిపోయిన చిరు.. ఈశ్వరయ్య గురించి ఎంక్వైవరీ చేసి ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయనతో కొద్దిసేపు గడిపారు.

2 /5

అంతేకాదు అభిమాని కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించి తనపై అభిమాని చూపించిన అభిమానికి  అండగా ఉంటాటని నిరూపించుకున్నారు.ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామి ఇచ్చారు.

3 /5

సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతి యేడాది అయ్యప్ప మాలను ధరించే ఈయన ఈ ఇయర్ కూడా మాలను ధరించారు.మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య ఫ్యామిలీతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు.

4 /5

సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు  ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా ఇంటికి పిలుపించుకున్నారు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని స్పెండ్ చేశారు. 

5 /5

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి చిరంజీవి  ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలతో మొక్కులు తీర్చుకోవడం విశేషం.