Sub Committee: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ, పీఆర్సీ వంటి సమస్యలపై ఉప సంఘం

Telangana Govt Announces Sub Committee For Employees: ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప సంఘం ఏర్పాటుతో త్వరలో సమస్యలకు పరిష్కాం లభించే అవకాశం ఉంది.

1 /6

పెండింగ్: తెలంగాణ ప్రభుత్వ, ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా డీఏలు ఐదు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

2 /6

పోరాటానికి సిద్ధం: ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉద్యోగుల తీవ్ర నిర్ణయానికి స్పందించిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులతో సమావేశమై చర్చించింది.

3 /6

ప్రభుత్వం హామీ: ఉపాధ్యాయ, ఉద్యోగులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

4 /6

ఉప సంఘం: ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

5 /6

ముగ్గురు మంత్రులు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతోపాటు కే కేశవరావుతో కూడిన ఉప సంఘం ఏర్పాటుచేశారు.

6 /6

పరిష్కారానికి చొరవ: ఈ ఉప సంఘం ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులతో సమావేశమై.. వారితో చర్చలు జరిపి నివేదిక ఇచ్చాక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని సమాచారం.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x