Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురు

Shweta Tiwari Personal Life: ఆమె అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు. వ్యక్తిగత జీవితం పక్కనపెడితే బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటూ వెండితెరపై హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. 42 ఏళ్ల వయసులోనూ తన అందంతో కుర్రకారు మతిపోగుడుతోంది. ఇంతకు ఆ భామ ఎవరంటే..?
 

1 /7

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే బ్యాక్‌ గ్రౌండ్ ఉండాలని చాలా మంది నుంచి వినిపించే మాట. అయితే తమ టాలెంట్‌ను నిరూపించుకుని ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. కొంతమంది సీరియల్స్‌లో తమ యాక్టింగ్‌తో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.  

2 /7

హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం భారీగా ఫేమ్ ఉంది. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టీవీ నటిగా ఆమె ఓ వెలుగు వెలుగుతున్నారు.   

3 /7

హిందీ సీరియల్ 'కసౌతీ జిందగీ కే'లో శ్వేత ప్రధాన పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా ఏడేళ్లు నడిచింది.  

4 /7

ఈ సీరియల్‌లో వచ్చిన ఫేమ్‌తో ఆమె బిగ్ బాస్ హిందీ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతీరుతో ఆ సీజన్ విజేతాగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు రావడంతో సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అవి హిట్ కాకపోవడంతో మళ్లీ బుల్లితెరకే పరిమితమైంది.   

5 /7

కెరీర్ పరంగా ఆమె నటించిన సీరియల్స్ సూపర్ హిట్స్ కాగా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది.  

6 /7

1998లో నటుడు రాజా చౌదరిని శ్వేతా తివారీ పెళ్లి చేసుకోగా.. విభేదాల కారణంగా 2007లో వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాత అభివన్ కోహ్లీని ప్రేమించి 2013లో వివాహం చేసుకుంది.   

7 /7

2019లో కుటుంబ సమస్యపై కోర్టుకు వెళ్లి.. ఏడాదిలోపే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. శ్వేతా తివారీ తన కొడుకు, కుమార్తెతో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఆస్తి రూ.81 కోట్లు ఉంటుందని అంచనా.