Kriti Sanon: మరోసారి నవ్వులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న ప్రభాస్ భామ కృతి సనన్..


Kriti Sanon: బీ టౌన్ భామ కృతి స‌న‌న్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా ఈమెకు ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ కథానాయికగా సత్తా చాటింది. లాస్ట్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించింది.

1 /6

కృతి సనన్.. గురించి తెలుగు ప్రేక్షకులకు  కొత్త‌గా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు బాలీవుడ్  బ్యూటీ అయినా.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.  

2 /6

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈమె ముందుగా తెలుగులో నటించిన పెద్దగా యూజ్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.

3 /6

కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో 2021 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కృతి సనన్. 

4 /6

గతేడాది  ప్ర‌భాస్ ప్ర‌భు శ్రీ‌రాముడిగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో సీతమ్మ పాత్ర‌లో నటించింది. పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించిన ఈ  సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర ఫలితాన్ని అందుకుంది.    

5 /6

కృతిసనన్.. గతేడాది ముంబైలోని బాంద్రాలో రూ.35 కోట్లతో  4 BHK అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కడే ఉంటుంది.

6 /6

ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి స‌న‌న్.. తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న నేనొక్క‌డినే, నాగ చైత‌న్యకు జోడిగా దోచెయ్ మూవీలో ప‌ల‌క‌రించింది. అటు తెలుగులో ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో నటించింది.