Suryapet Politics: గణేశ్ ఉత్సవాల్లో ఒక్కటైన బద్ద శత్రువులు.. సూర్యాపేటలో ఆసక్తికర పరిణామం

Special Attraction In Suryapet Ganesh Immersion Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా బద్ద శత్రువులు ఒక్క చోటకు చేరారు. రాజకీయాలకతీతంగా జరిగిన ఉత్సవాల్లో వారిద్దరూ పాల్గొని ఒకే వేదికపై.. పక్కపక్కనే కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.

1 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది.

2 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: శోభయాత్ర సందర్భంగా మండపాల వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఉత్కంఠగా లడ్డూ వేలం పాటలు నిర్వహించారు.

3 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేట గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వహించిన శోభాయాత్రలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

4 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: జగదీశ్‌, దామోదర్‌ రెడ్డి ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం ఆసక్తికరంగా మారింది.

5 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన రామ్‌రెడ్డి దామోదర్‌ రెడ్డి, హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జగదీశ్‌ రెడ్డి గెలిచారు. వీరిద్దరూ రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉంటారు.

6 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: పట్టణంలోని పలు వార్డులలో జరిగిన నిమజ్జన యాత్రలో పాల్గొని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాక్టర్‌ నడిపారు.

7 /7

Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేటలో గణపతి మండపాలను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.