UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్ (యూపీఎస్‌)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్‌ అమలులో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్ (ఎన్‌పీఎస్‌) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్‌పీఎస్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు.
 

1 /7

23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ఓ ఉద్యోగి తన చివరి 12 నెలలు పొందిన జీతంలోని బేసిక్‌ పే సగటులో 50 శాతాన్ని నెలనెలా పెన్షన్‌గా పొందుతారు. ఏప్రిల్‌ 1, 2025 నుంచి యూపీఎస్‌ అమలు చేయనుంది.  

2 /7

ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగులు, రిటైర్‌మెంట్ అయినవారు యూపీఎస్‌లో చేరవచ్చు. అయితే యూపీఎస్‌లో కచ్చితంగా చేరాలనే నిబంధన ఏమీ లేదు.  

3 /7

యూపీఎస్‌ అనేది ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ని మెరుగుపరిచే ప్రయత్నమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. యూపీఎస్ కింద గ్యారంటీ పెన్షన్ ఉంటుందన్నారు.  

4 /7

అయితే ఎన్‌పీఎస్‌పై ఎలాంటి యూటర్న్ తీసుకునే ప్రసక్తి లేదన్నారు. అయితే ఎన్‌పీఎస్‌ కంటే యూపీఎస్‌ ఎంతో బాగుంటుందన్నారు. ఈ స్కీమ్‌తో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదన్నారు.   

5 /7

యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.   

6 /7

ఓపీఎస్ స్థానంలో కేంద్రం ఎన్‌పీఎస్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ను జనవరి 1, 2004 నుంచి అమలులోకి తీసుకువచ్చింది.  

7 /7

అయితే ఈ స్కీమ్‌లో గ్యారంటీ పెన్షన్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తీసుకువచ్చింది.