Mars-Ketu Transit: ముగుస్తున్న మంగళ-కేతు యుతి, నవంబర్‌లో ఇక ఆ 5 రాశుల ఇంట ధన ప్రవాహమే

Mars-Ketu Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటుంది. జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెలకు ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కొన్ని రాశులకు అదృష్టంగా మారనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2023, 06:56 AM IST
Mars-Ketu Transit: ముగుస్తున్న మంగళ-కేతు యుతి, నవంబర్‌లో ఇక ఆ 5 రాశుల ఇంట ధన ప్రవాహమే

Mars-Ketu Transit: ఖగోళ శాస్త్రం ప్రకారం నిత్యం జరిగే గ్రహాల కదలికను జ్యోతిష్యంలో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్దేశిత సమయంలో ప్రవేశిస్తుందంటారు. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. అందుకే నవంబర్ నెల జాతకరీత్యా కొంతమందికి చాలా విశిష్టత కలిగిందిగా భావిస్తారు. 

ఈ ఏడాది నవంబర్ నెలలో కొన్ని రాశులకు అదృష్టం తిరగరాయనుంది. అక్టోబర్ 30వ తేదీన కేతువు గోచారం ఉంది. తులా రాశిలో ఉన్న కేతువు మంగళ గ్రహంతో యుతి ఏర్పర్చి ఉన్నాడు. మంగళ కేతు గ్రహాల యుతిని అశుభంగా భావిస్తారు. ఎందుకంటే చాలా రాశులకు ఇది సమస్యల్ని తెచ్చిపెట్టనుంది. అక్టోబర్ 30 నుంచి కేతువు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల మంగళ-కేతు గ్రహాల అశుభ యుతి తొలగిపోతుంది. ఫలితంగా 5 రాశులవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. తద్వారా వద్దంటే డబ్బు వచ్చి పడనుంది. 

తులా రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలమైందిగా పరిగణిస్తారు. ఆదాయం భారీగా పెరగడం వల్ల ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు తగ్గిపోవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 

మంగళ-కేతు గ్రహాల యుతి అంతం కావడం వల్ల వృశ్చిక రాశి జాతకులకు  ఊహించని లాభం కలగనుంది. కుుటంబంలో మనశ్శాంతి ఉంటుంది. కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. ఆర్ధిక పరిస్థితితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు చాలా అనువైన సమయం.

మేష రాశి జాతకులకు కేతువు  ప్రభావం శుభప్రదం కానుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపారులకు మంచి సమయం. పెట్టిన పెట్టుబడులు లాభాలు ఆర్జిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆదాయయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. 

మిధున రాశి జాతకులకు దీపావళి కంటే ముందే పండుగ వాతావరణం నెలకొంటుంది. అంటే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఫలితంగా ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారులకు పెద్దఎత్తున లాభాలుంటాయి. కొత్త డీల్స్ చేతికి అందడంతో ఇక తిరుగుండదు. పూర్వీకుల నుంచి సంపద లాభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. 

వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ సమయంగా చెబుతారు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు ఇరువురికీ ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కారణంగా అంతా కలిసొస్తుంది. ఊహించని మార్గాల్నించి డబ్బులు వచ్చి పడనున్నాయి. జీవితంలో అంతా పాజిటివ్‌గా ఉంటుంది. ప్రతి రంగంలో లాభాలుంటాయి. ఆర్ధిక సమస్యలన్నీ తొలగిపోతాయి. 

Also read: Vastu for Car Parking: వాహనాలు పార్కింగ్‌కు కూడా వాస్తు ఉంటుందా, ఈ రూల్స్ తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News