కొత్త అవతారంలో ఆశిష్ నెహ్రా

          

Last Updated : Nov 16, 2017, 08:24 AM IST
    • వ్యాఖ్యాతగా కనిపించనున్న నెహ్రా
    • విషయాన్ని ప్రకటించిన మిత్రుడు వీరేంద్ర సెహ్వాగ్
కొత్త అవతారంలో ఆశిష్ నెహ్రా

అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవల గుడ్ బై చెప్పేసిన ఆశిష్ నెహ్రా గురువారం నాడు వ్యాఖ్యాతగా మారబోతున్నాడు. ఇండియా-శ్రీలంక మధ్య జరిగే తొలి టెస్ట్ క్రికెట్ లో కామెంట్రీ గదిలో కూర్చొని వ్యాఖ్యాతల బృందంలో అతనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని నెహ్రా చిన్ననాటి స్నేహితుడు వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. విశేషమేమిటంటే ఆ వ్యాఖ్యాతల బృందంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. స్నేహితులిద్దరూ కలిసి ఇలా ఒకే వేదిక పంచుకోవడం విశేషమే. 

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో ఈ టెస్ట్ మ్యాచ్ గురువారం 9:30am కు ప్రారంభం కానుంది. 18 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో, 25 ఏళ్ల పాటు ఆటలో కొనసాగిన ఆశిష్ నెహ్రా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల క్రికెట్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే..! 

 

Trending News