Khairatabad Ganesh: దయచేసి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి రావద్దు.. భక్తులకు హెచ్చరిక..

Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గణపతికి ఒక్కో విశిష్ఠత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గణేష విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఖైరతాబాద్ లో కొలువై భక్తులకు దర్శనిమిస్తుంది. అయితే.. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఖైరతాబాద్ వచ్చి గణేషుడిని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ప్రజలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది ప్రజలు ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తడంతో అక్కడ రద్దీ నెలకొంది. దీంతో భక్తులు దర్శనానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 16, 2024, 10:29 AM IST
Khairatabad Ganesh: దయచేసి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి రావద్దు.. భక్తులకు హెచ్చరిక..

Khairatabad Ganesh:వరుస సెలవులు రావడంతో ప్రజలు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో   ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిలిపివేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేశారు. శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దర్శనానికి నిన్న చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిశాయి. భక్తులు రాకతో..  ఖైరతాబాద్లో మెట్రో స్టేషన్,  టెలిఫోన్ భవన్, ఐ మాక్స్ వైపు మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు.  ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ ను  మోనిటరింగ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టారు. కాగా రేపు శోభాయాత్ర తర్వాత… హుస్సేన్ సాగర్‌లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

రేపు అనంత చతుర్ధశి నేపథ్యంలో మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్‌ నిమజ్జనానికి 17వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News