IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు ఖర్చు చేసిన 10 జట్లు!!

IPL Auction 2022 Ends: బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఐపీఎల్ 2022లో పాల్గొననున్న 10 జట్లు 204 మంది ఆటగాళ్ల కోసం 550.70 కోట్లు ఖర్చు చేశాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 09:52 PM IST
  • ముగిసిన ఐపీఎల్ 2022 వేలం
  • 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు ఖర్చు
  • అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్​ కిషన్
IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు ఖర్చు చేసిన 10 జట్లు!!

IPL 2022 Mega Auction Closed: బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. ఐపీఎల్ 2022లో పాల్గొననున్న 10 జట్లు 204 మంది ఆటగాళ్ల కోసం 550.70 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో అమ్ముడైన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిస్తే.. చివరి ఆటగాడిగా అమన్ ఖాన్ నిలిచాడు. వేలంలో అమ్ముడుపోయిన జాబితాలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక మెగా వేలంలో ఇషాన్​ కిషన్ ​(రూ.15.25కోట్లు, ముంబైఇండియన్స్​) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. 

మెగా వేలంలో ఇషాన్​ కిషన్​ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలవగా.. దీపక్ చహర్​ రూ.14 కోట్ల (సీఎస్కే), శ్రేయస్​ అయ్యర్​ రూ.12.25కోట్లు (కేకేఆర్​) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. నిందు హసరంగా రూ. 10.75 కోట్లు (ఆర్సీబీ), నికోలస్ పూరన్ రూ. 10.75 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 

ఐపీఎల్ 2022 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా.. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక చెన్నై ఖాతాలో రూ. 2.95 కోట్లు మిగిలాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 23 మంది ఆటగాళ్లను తీసుకోగా.. 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టుకి రూ. 10 లక్షలు మిగిలాయి. లక్నో సూపర్ జెయింట్స్ 21 మంది ఆటగాళ్లను కొనుక్కోగా.. ఆ జట్టు పర్స్ వాల్యూ జీరోగా ఉంది.

10 జట్ల వివరాలు:
# చెన్నై సూపర్ కింగ్స్ - 25 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 2.95 కోట్లు మిగిలాయి

# ఢిల్లీ క్యాపిటల్స్ - 24 మంది ఆటగాళ్లు, 7 ఓవర్సీస్, రూ. 10 లక్షలు మిగిలాయి

# కోల్‌కతా నైట్ రైడర్స్ - 25 మంది ఆటగాళ్లు, 5 ఓవర్సీస్, రూ. 45 లక్షలు మిగిలాయి

# ముంబై ఇండియన్స్ - 25 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 10 లక్షలు మిగిలాయి

# పంజాబ్ కింగ్స్ - 25 మంది ఆటగాళ్లు, 7 ఓవర్సీస్, రూ. 3.45 కోట్లు మిగిలాయి

# రాజస్థాన్ రాయల్స్ - 24 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 95 లక్షలు మిగిలాయి

# రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 22 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 1.55 కోట్లు మిగిలాయి

# సన్‌రైజర్స్ హైదరాబాద్ - 23 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 10 లక్షలు మిగిలాయి

# లక్నో సూపర్ జెయింట్స్ - 21 మంది ఆటగాళ్లు, 7 ఓవర్సీస్, రూ. 0 మిగిలి ఉంది

# గుజరాత్ టైటాన్స్- 23 మంది ఆటగాళ్లు, 8 మంది ఓవర్సీస్, రూ. 15 లక్షలు మిగిలాయి

Aslo Read: IPL 2022 Auction Chama Milind: ఐపీఎల్‌ 2022లో హైదరాబాద్ సీపీ కుమారుడు.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే?

Also Read: IPL 2022 Auction: ఆడింది ఒకేఒక్క ఐపీఎల్ మ్యాచ్.. చేసింది 1 పరుగే! అయినా రూ. 8.25 కోట్లు దక్కించుకున్నాడు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News