సింధుపై విజయం సాధించిన సైనా..!

ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధుపై సైనా నెహ్వాల్‌ ఘన విజయం సాధించింది. 

Last Updated : Jan 26, 2018, 03:53 PM IST
సింధుపై విజయం సాధించిన సైనా..!

ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధుపై సైనా నెహ్వాల్‌ ఘన విజయం సాధించింది. ఈ టోర్నిలో మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌ పోటీలో సైనా, సింధు ఇరువురు పోటీ పడగా... సింధుపై సైనా విజయ దుందుభి మ్రోగించింది. ఫలితంగా రెండు వరుస గేమ్‌ల్లో ఓడిపోయిన సింధు ఈ టోర్ని నుండి వైదొలిగింది. 37 నిమిషాల పాటు సాగిన హోరాహోరి పోరులో సైనా అంచనాలను సింధు ఏ మాత్రం అందుకోలేకపోయింది. ప్రారంభం నుండే సైనా దూకుడుగా ఆడుతూ సింధుని కట్టడి చేసింది.  21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సైనా తర్వాత కూడా రాకెట్‌లా దూసుకుపోయింది. ఆ తర్వాత సింధు కొంత వరకు ప్రతిఘటించినా.. సైనా స్పీడ్‌ను అందుకోవడం కష్టమైంది. ఎట్టకేలకు 21-19తో రెండో గేమ్‌ను  సైనా సొంతం చేసుకొని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 

Trending News