కరీంనగర్ మానేరు వంతెనపై కారు ప్రమాదం

కరీంనగర్ మానేరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ .. ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణీకుల్లో ఒకరు మృతి చెందారు.

Last Updated : Feb 16, 2020, 11:37 AM IST
కరీంనగర్ మానేరు వంతెనపై కారు ప్రమాదం

కరీంనగర్ మానేరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ .. ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణీకుల్లో ఒకరు మృతి చెందారు.  మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు మానేరు డ్యాం బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్  అయింది. ఇటు అలుగునూరు నుంచి అటు .. కరీంనగర్ బైపాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి.  ఈ క్రమంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఓ కానిస్టేబుల్ ప్రయత్నించారు. కానీ ఆయన ప్రమాదవశాత్తూ ట్రాఫిక్ నియంత్రిస్తుండగానే కాలు జారి వంతెన కిందకు పడిపోయాడు. ఆయనకు కూడా తీవ్రగాయాలయ్యాయి.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Trending News