Ganja Cultivation In Telangana: తెలంగాణలో గంజాయి​ స్మగ్లింగ్​పై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్​

Ganja Cultivation In Telangana: తెలంగాణలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు(KCR Review Meeting Updates) పోలీసు, ఎక్సైజ్​ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతోందన్న నివేదికల వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 04:02 PM IST
    • తెలంగాణలో గంజాయి సాగు, వినియోగం నివేదికలపై సీఎం కేసీఆర్​ ఆగ్రహం
    • పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
    • గంజాయి నిర్మూలనకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశం
Ganja Cultivation In Telangana: తెలంగాణలో గంజాయి​ స్మగ్లింగ్​పై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్​

Ganja Cultivation In Telangana: తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు(CM KCR Latest News) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి​ పెంపకం, వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించాలని పోలీసులను ఆదేశించారు. గంజాయి​ వినియోగంపైనే కాకుండా జూదం, అక్రమ మద్యం రవాణాను అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి.. వాటి నిర్మూలనకు పాటు పడిన అధికారులకు నగదు లేదా ప్రమోషన్లు రూపంలో లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. 
"ఎన్నో పోరాటాల తర్వాత మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుంచడం సహా రాష్ట్రంలో పోలీసుల సహకారం ద్వారా అత్యుత్తమ శాంతిభద్రతలను నెలకొల్ప గలిగాం. ఈ క్రమంలో తీవ్రవాదాన్ని నియంత్రించాం. దీంతో మన రాష్ట్రంపై ఇతర రాష్ట్రాల వారికి గౌరవం పెరిగింది. కానీ, ఇప్పటికీ తెలంగాణలో నిషేధిత పదార్థాలు (గంజాయి​) లభించడం దురదుష్టకరం. వీటిని నిర్మూలించకపోతే అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పోలీసు, ఎక్సైజ్​ అధికారులు వీటి నిర్మూలనకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అమాయక యువత వాటి బారిన పడుతున్నారు. మరెంతో మంది వాటి బారిన పడి బలికాక ముందే అధికారులు చర్యలు చేపట్టాలి" అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్​ రావు వెల్లడించారు.   
రాష్ట్రంలో(Telangana News) గంజాయి నిర్మూలన కోసం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ స్పెషల్​ టీమ్​ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఆయన చెప్పారు. విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా ఉంచాలని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. నేరగాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసీఆర్​ హెచ్చరించారు. 
ప్రజల్లో అవగాహన..
గంజాయి​ వినియోగం ఎంత ప్రమాదకరమైనదో(Charas Drug Effects) విద్యార్థి దశ నుంచే తెలియజేసేలా చేయాలని సీఎం కేసీఆర్(KCR Review Meeting Updates)​ అభిప్రాయపడ్డారు. షార్ట్​ ఫిల్మ్స్​, డాక్యుమెంటరీలు, మెసేజ్​ ఓరియెంటెడ్​ ఆడియోలు, వీడియోల ద్వారా గంజాయి వల్ల ఏర్పడే అనర్థాలను ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.   

Also Read: అమరులైన పోలీసుల సేవలు మరవం ‌‌- సీఎం కేసీఆర్‌

Also Read:  2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News