పోల్ బాటలో కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబాలు

వేర్వేరు ప్రాంతాల్లో ఓటేసిన కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబాలు

Last Updated : Apr 11, 2019, 07:41 PM IST
పోల్ బాటలో కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబాలు

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సతీమణి శభతో కలిసి వెళ్లి మెదక్ పార్లమెంటరీ స్థానం పరిధిలోని తమ స్వగ్రామమైన చింతమడకలో నేడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కూడా అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఉన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భార్య శైలిమతో కలిసి వెళ్లి బంజారాహిల్స్ నందినగర్‌లోని కమ్యునిటీ హాల్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Trending News