దివ్య హత్య కేసు మిస్టరీ వీడినట్లేనా?

తెలంగాణలో సంచలనం రేపిన దివ్య హత్యా కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. 

Last Updated : Feb 19, 2020, 07:46 PM IST
దివ్య హత్య కేసు మిస్టరీ వీడినట్లేనా?

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన దివ్య హత్యా కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. దివ్యను వెంకటేష్ గౌడ్ అనే యువకుడు కత్తితో పొడిచాడని, ఈ ఘటనలో, పరారీలో ఉన్న వెంకటేశ్ ఎట్టకేలకు వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు. వెంకటేశ్ కోసం ఐదు పోలీసు బృందాలు తీవ్రస్థాయిలో గాలింపు జరిపాయని, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోందని అన్నారు. 

గత మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరికి ప్రేమ వివాహం జరిగిందని, అయితే పెళ్లికి వెంకటేష్ తల్లిదండ్రులు అంగీకరించకపోగా, పెళ్లి తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారని అన్నారు.  విడిపోయిన కొంత కాలం తర్వాత వెంకటేశ్ మళ్ళీ వేధిస్తుండడంతో ఆమె తల్లితండ్రులు తమ కుమార్తె జోలికి వెళ్లకుండా మళ్ళీ వెంకటేశ్ తో హామీ పత్రం రాయించుకున్నారని తెలిపారు. కొంతకాలం కిందట దివ్యకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని, ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. 

ఒకవైపు పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో వెంకటేష్, తనకు దక్కలేదన్న ఉద్దేశంతో గొంతుకోసి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశానని పోలీసుల ముందు తెలియజేశాడని అన్నారు. తీవ్రగాయాలపాలైన దివ్య అక్కడికక్కడే మరణించిందని, వేములవాడలో వెంకటేష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తాము ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు వివరించారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News