కేటీర్ఆర్ను కాంగ్రెస్ పీసీసీ ఛీప్ ( Telangana PCC Chief ) ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) ప్రశంసించారు. సూర్యపేటలో జరిగిన ఈ అరుదైన పరిణామంతో సభలో ఉన్న వాళ్లు అవాక్కయ్యారు.
సూర్యపేట ( (Suryapet ) జిల్లా హుజూర్ నగర్లో జరిగిన నూతన ఆర్టివో కార్యాలయాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హైదరాబాద్-విజయవాడ ( Hyderabad - Vijayawada ) మధ్య హైస్పీడ్ ట్రైన్ ( High Speed Train ) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. హైస్పీడ్ ట్రైన్ వస్తే రెండు నగరాల మధ్య ఉన్న జాతీయ రహదారి ( National Highway ) అభివృద్ధి చెందుతుంది అన్నారు కేటీఆర్. Also Read : వణికిస్తోన్న కరోనా.. భాగ్యనగరంలో మళ్లీ లాక్డౌన్ తప్పదా!
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్దీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @jagadishTRS . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ @TRSSaidireddy, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ @DrGadari, ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/t9I8ixyYVB
— TRS Party (@trspartyonline) June 29, 2020
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసి చీఫ్ గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ్ ను కేటీఆర్ అభినందించారు. అయితే సభలో ఎవరూ ఊహించని విధంగా కేటీఆర్ డైనామిక్ లీడర్ అని ప్రశంసించారు ఉత్తమ్. ఆ సమయంలో సభలో ఉన్న వాళ్లంతా ముందు షాక్ అయినా తరువాత తేరుకుని చప్పట్లు కొట్టారు.