ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

Last Updated : Jul 8, 2018, 08:17 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్యాంగ్‌ బోచే పరిధిలోని మస్టాంగ్‌ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతిచెందగా.. పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మస్టాంగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32మంది కార్మికులతో వెళ్తున్న లారీ ట్రక్కు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి విధులకు వెళ్లడానికి కార్మికులందరూ లారీ ఎక్కారు. లారీ బయల్దేరిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. జోమ్‌సమ్‌-లోమన్‌థంగ్‌ రోడ్డు సెక్షన్‌ వద్ద.. 50 అడుగుల లోతులో లారీ ట్రక్కు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో గాయపడ్డవారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని హెలికాప్టర్‌ ద్వారా సహాయక సేవలందించారు.

Trending News