Gunman fires on bus: కొసావోలో దారుణం...కదులుతున్న బస్సుపై కాల్పులు.. ముగ్గురు మృతి..

గుర్తుతెలియని సాయుధుడు కదులుతున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొసావోలో జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 02:01 PM IST
Gunman fires on bus: కొసావోలో దారుణం...కదులుతున్న బస్సుపై కాల్పులు.. ముగ్గురు మృతి..

Gunman fires on bus: ఐరోపా దేశమైన కొసావో(Kosovo)లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు(unknown assailant) ఓ బస్సుపై కాల్పులు(Firing) జరపడంతో..ముగ్గురు మృతి చెందారు. ఈ కాల్పుల్లో బస్సు డ్రైవర్, ఇద్దరు యువకులు మరణించారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజధాని ప్రిస్టినాకు 90 కిమీ దూరంలో ఉన్న గ్లోగ్జాన్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఎనిమిది మందితో వెళ్తున్న ఈ బస్సుపై ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే దాడికి గల కారణాలు తెలియదని పోలీసులు తెలిపారు. "ఇది తీవ్రవాద చర్య అని నమ్మేందుకు ఆధారాలు లేవని" అని ఎల్షానీ అనే పోలీసు అధికారి చెప్పారు.

Also Read: Bus Crash: సెంట్రల్ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం...19 మంది మృతి

ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు వ్జోసా ఉస్మానీ(President Vjosa Osamni )దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నేరస్థులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు.. అల్బేనియా పర్యటనలో ఉన్న అంతర్గత వ్యవహారాల మంత్రి జిలాల్ స్వేక్లా(Xhelal Svecla) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

 

Trending News