అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా 9వ తరగతి విద్యార్థిని..!

కృష్ణాజిల్లా ముదినేపల్లిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అంబుల వైష్ణవి అనే విద్యార్థినిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తున్నట్లు ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

Last Updated : Jan 30, 2018, 10:04 PM IST
అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా 9వ తరగతి విద్యార్థిని..!

కృష్ణాజిల్లా ముదినేపల్లిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అంబుల వైష్ణవి అనే విద్యార్థినిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తున్నట్లు ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇటీవలే వైష్ణవి రూ.1 లక్షను విరాళంగా అందివ్వడం గమనార్హం. అదేవిధంగా ఆమె తన గ్రామంలోని రెండు పాఠశాలలను దత్తత తీసుకొని, వాటి కోసం 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం విశేషం. అంత చిన్న వయసులోనే వైష్ణవి చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. చిన్నతనంలోనే సమాజ సేవ చేయాలని, దేశాభ్యుదయానికి పాటు పడాలని విద్యార్థులు భావించాలని.. అందరూ వైష్ణవిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా వైష్ణవిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. 

Trending News