AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, 24 గంటల్లో కేవలం 4 వేల కేసులు నమోదు

AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2021, 07:41 PM IST
AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, 24 గంటల్లో కేవలం 4 వేల కేసులు నమోదు

AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి తగ్గుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 18 గంటల కర్ఫ్యూతో కరోనా సంక్రమణ తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 64 వేల 8 వందలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..4 వేల 872 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 86 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 11 వేల 552మంది మృత్యువాత పడ్డారు. 

మరోవైపు గత 24 గంటల్లో 13 వేల 702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 లక్షల 37 వేల మంది కోలుకున్నారు. ఏపీలో మొత్తం 1 కోటి 98 లక్షల 56 వేల 521 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 14 వేల 510 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 961 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 810 కేసులు నమోదయ్యాయి. 

Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్‌కు ఏపీ ప్రభుత్వం సన్నద్ధం, పీడియాట్రిక్ వార్డులపై ప్రత్యేక దృష్టి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News