ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు హతం

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు హతం

Last Updated : Sep 22, 2019, 05:05 PM IST
ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు హతం

విశాఖపట్టణం: జిల్లాలోని జీకేవీధి మండలం మాదిగమల్లులోని ధారకొండ ఎజెన్సీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. ఏజెన్సీలో మావోల కదలికలు ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు ఒక పథకం ప్రకారం వారిని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య భీకర స్థాయిలో కాల్పులు చోటుచేసుకోగా.. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మృతిచెందారు. 

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉన్నట్టు సమాచారం.

Trending News