విదేశీ సంస్థలకు పట్టంకడుతూ స్థానికులకు భూములివ్వడం లేదని పవన్ చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరి లోకేష్ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికులకు భూములివ్వకుండా ఫ్రాంక్లిన్ సంస్థకు ఇచ్చిందన్న పవన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేశ్ చెప్పారు. రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందన్నారు.
ఎవరొచ్చినా ఎర్ర తివాచీతో ఆహ్వానిస్తాం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొచ్చినా ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తామన్నారు. స్థానిక పెట్టుబడిదారులకు మరింత ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ఎవరొచ్చినా వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. స్థానిక పారిశ్రామిక వేత్తలకు అన్యాయం జరుగుతోందని పవన్ ప్రచారం చేయడం సరికాదని ..వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని పవన్ కల్యాణ్ కు లోకేష్ హితవు పలికారు.
Anyone willing to invest and create jobs in AP will be given a red carpet welcome without the red tape. And I will personally receive them and handhold them to realize their business goals. AP didn’t become No. 1 in EoDB for nothing. pic.twitter.com/MU5nm7h1Cv
— Lokesh Nara (@naralokesh) June 9, 2018