ఓయూలో పవన్ దిష్టి బొమ్మ దగ్ధం, ఉద్రిక్తత

పవన్ దిష్టిబొమ్మ దహనంతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Last Updated : Jan 19, 2018, 01:54 PM IST
ఓయూలో పవన్ దిష్టి బొమ్మ దగ్ధం, ఉద్రిక్తత

హైదరాబాద్: పవన్ కల్యాణ్ - కత్తిమహేష్ అంశంపై రోజు రోజుకు ముదురుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సెగ ఉస్మానియా వర్శిటీ వరకు తాకింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే... కత్తిమహేష్ పై దాడికి నిరసిస్తూ ఓయూ విద్యార్ధులు ఉస్మానియా వర్శిటీలో ఈ రోజు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడేక్కింది.  జై జనసేన.. జై పవన్ కల్యాణ్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలవురిని అదుపులోకి తీసుకున్నారు.

గత కొంత కాలంగా జనసేన అధినేతకు వ్యతిరేకంగా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగ్రహించిన పవన్ అభిమానులు ఆయనపై మాటల యుధ్ధానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై ఇటీవలే కోడిగుడ్ల దాడికి పాల్పడ్డారు. ఈ చర్యకు నిరసిస్తూ ఓయూ స్టూడెంట్స్ పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

Trending News