వైఎస్ జగన్‌పై పోటీకి టీడిపి అభ్యర్థి ఖరారు ?

వైఎస్ జగన్‌పై పోటీకి టీడిపి అభ్యర్థి ఖరారయ్యారా ?

Last Updated : Jan 8, 2019, 02:03 PM IST
వైఎస్ జగన్‌పై పోటీకి టీడిపి అభ్యర్థి ఖరారు ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై పోటీకి టీడీపీ అభ్యర్థి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. గతంలో శాసనమండలికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన టీడీపీ సీనియర్‌ నేత వీ సతీశ్‌ కుమార్ రెడ్డిని పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్‌పై పోటీకి దింపేందుకు టీడీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. గతంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసిన వీ సతీష్ కుమార్ రెడ్డి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్ జగన్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

దశాబ్ధాల తరబడిగా వైఎస్‌ఆర్ కుటుంబానికి కంచుకోటగా వున్న పులివెందుల నియోజకవర్గంలో సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఆ కుటుంబాన్ని ఎన్నికల సమరంలో ఢీకొడుతూ వస్తున్నారు. అందుకే ఈసారి కూడా మళ్లీ సతీష్ కుమార్ రెడ్డికే ఆ అవకాశాన్ని ఇచ్చి చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x