Visakha padayatra: విశాఖ ఉక్కు పరిరక్షణకు వైసీపీ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభం

Visakha padayatra: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది.  విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తలపెట్టిన పాదయాత్ర స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగసభతో ముగియనుంది.  

Last Updated : Feb 20, 2021, 11:16 AM IST
Visakha padayatra: విశాఖ  ఉక్కు పరిరక్షణకు వైసీపీ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభం

Visakha padayatra: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది.  విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తలపెట్టిన పాదయాత్ర స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగసభతో ముగియనుంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం ( Visakha steel plant privatisation ) చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యోగ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయవద్దంటూ ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది. జీవీఎంసీ మహాత్మాగాందీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అశీల్‌మెట్ట జంక్షన్, సంగం శరత్, కాళీ టెంపుల్, తాటిచెట్ల పాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్‌పోర్ట్, షీలానగర్, బీహెచ్‌పీవీ, పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్ స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వరకూ ఐదు నియోజకవర్గాల మీదుగా 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.  స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ  సభతో పాదయాత్ర ముగియనుంది.

తెలుగు ప్రజల జాతికి గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేందుకే పాదయాత్ర ( Visakha Padayatra )చేపట్టినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai reddy )తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగనుంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించడంతో పాటు రుణాల్ని ఈక్విటీగా మార్చాలని సీఎం ప్రతిపాదించినట్టు తెలిపారు. ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజాల మైన్స్‌తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు అండగా ప్రభుత్వం ఉందనే భరోసాను విశాఖ ప్రజల్లో కల్పించేందుకే ఈ పోరాట యాత్ర అని చెప్పారు. మంత్రులు అవంతి శ్రీనివాస్ ( Minister Avanthi srinivas ), ధర్మాన కృష్ణదాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Also read: LG Polymers incident: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వ పనితీరుపై ప్రశంస

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News