SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- అలా చేస్తే ఖాతాలు డబ్బులు మాయం!

SBI Alert: ఎస్​బీఐ కస్టమర్లకు హెచ్చరిక​! బ్యాంక్ ఖాతాదారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్​బీఐ గుర్తించింది. ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 11:36 PM IST
  • కస్టమర్లను అప్రమత్తం చేసిన ఎస్​బీఐ
  • సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో అలర్ట్​
  • మోసాల బారిన పడకుండా సలహాలు
SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- అలా చేస్తే ఖాతాలు డబ్బులు మాయం!

SBI Alert: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్​బీఐ ఖాతా దారులకు అలర్ట్​. ఇటీవల జరిగిన బ్యాంక్ మోసాలను వివరిస్తూ.. కస్టమర్లు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించింది. తాజాగా సైబర్ మోసాగాల్లు కొత్త కొత్త మార్గాల్లో.. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేస్తున్నారని అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా కస్టమర్లందరికీ కీలక సూచనలు జారీ చేసింది.

మోసాలు ఎలా జరుగుతున్నాయి?

ఇటీవల ఓటీపీలు కనుక్కుని మోసాలు చేసే నేరగాళ్ల గురించి జనాల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు సైబర్​ మోసగాళ్లు. ఇందుకోస బ్యాంక్ కస్టమర్లకు ఎస్​బీఐ నుంచి చేసినట్లుగా ఎస్​ఎంఎస్​లు పంపిస్తున్నారు.
అచ్చం ఎస్​బీఐ నుంచి వచ్చినట్లుగానే ఈ ఎస్​ఎంఎస్​లు ఉంటాయని. అందులో మీ కేవైసి వివరాలు అప్​డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని ఉంటోంది.

ఆ ఎస్​ఎంఎస్​ నిజమైందని నమ్మి ఆ లింక్​పై క్లిక్​ చేస్తే.. అందుల ఓ పేజీకి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తిగత వివరాలన్నీ కోరుతుంది. వాటన్నింటిని ఎంటర్​ చేసి.. ఓటీపీ వెరిఫికేషన్ వంటివి పూర్తి చేస్తే.. అంతే సంగతులు. ఆ వివరాలన్నింటితో సైబర్ నేరగాళ్లు.. ఆయా వ్యక్తుల బ్యాంక్​ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న బ్యాంక్ కస్టమర్లు.. తమ ఖాతాలో డబ్బు పోయిందని గ్రహిస్తున్నారు.

అయిత ఆలాంటి ఎస్​ఎంఎస్​ల పట్ల జాగ్రత్తగా ఉండాలన ఎస్​బీఐ తాజా ట్వీట్​లో కస్టమర్లకు సూచించింది. ఎస్​బీఐ ఎప్పుడు కూడా కేవైసీ అప్​డేట్​ చేయాలని లింక్​లు పంపదని స్పష్టం చేసింది. అలాంటి ఎస్​ఎంఎస్​లు వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయొద్దని సూచించింది. అలాంటి ఎస్​ఎంఎస్​లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్​ క్రైమ్​ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది.

Also read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!

Also read: LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ వాయిదా.. వచ్చే వారమే అధికారిక ప్రకటన?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News